సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్ర దాడి..

జమ్మూ కశ్మీర్ లో సోపోర్ పట్టణంలో బుధవారం ఉదయం సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్ర దాడి జరిగింది. ఈ ఉగ్రదాడిలో ఓ పౌరుడు మరణించాడు. ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన పౌరుడి రక్తం చిందిన శరీరంపై మూడేళ్ల పిల్లవాడు కూర్చొని ఏడుస్తున్న ఫొటో అందరి చేత కంటతడి పెట్టిస్తోంది. సోషల్ మీడియాలో ఆ ఫొటో బాగా వైరల్ అవుతోంది. 

సోపోర్ పట్టణంలో బుధవారం ఉదయం పెట్రోలింగ్ చేస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఒక జవాన్ కూడా మరణించాడు. అయితే ఓ చిన్నారి తన తాతతో కలిసి శ్రీనగర్ నుంచి హంద్వరాకు కారులో వెళ్తుండగా..శ్రీనగర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంో ఉన్న బారాముల్లా జిల్లాలోని సోపోర్ పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.  

ఈ కాల్పుల్లో ఒక జవాన్ మరియు ఒక పౌరుడు మరణించినట్లు పోలీసులు తెలిపారు. అయితే మూడేళ్ల బాలుడ్ని బుల్లెట్ తగలకుండా పోలీసులు రక్షించారు. ఆ చిన్నారిని భద్రత కోసం తీసుకెళ్తున్న ఫొటోను కూడా కశ్మీర్ పోలీసులు ట్వీట్ చేశారు.  

 

Leave a Comment