రాత్రిపూట అడవిలోకి తీసుకెళ్లి.. మహిళా ట్రైనీ ఎస్సైపై ఎస్ఐ లైంగిక దాడి..!

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్ లో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘటన పోలీస్ శాఖలో ప్రకంపనలు సృష్టించింది. శిక్షణలో భాగంగా స్టేషన్ కు వచ్చిన ట్రైనీ ఎస్సైపై స్టేషన్ ఎస్సై శ్రీనివాస్ రెడ్డి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఉన్నతాధికారులు ఎస్సై శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేశారు. ఎస్సైపై శాఖపరమైన విచారణకు ఆదేశించారు.

ఏం జరిగిందంటే..

ట్రైనీ ఎస్సై ఫిర్యాదు ఆధారంగా వివరాలు ఇలా ఉన్నాయి. శిక్షణలో భాగంగా మహిళా ఎస్సై 15 రోజుల క్రితం మరిపెడ స్టేషన్ కు వచ్చారు. సోమవారం రాత్రి పెద్ద మొత్తంలో నల్లబెల్లం ఉన్నట్లు సమాచారం వచ్చిందని ఎస్సై శ్రీనివాస రెడ్డి ట్రైనీ ఎస్సైని వెంటబెట్టుకుని అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సాధారణంగా పోలీస్ స్టేషన్ లో వాహనం నడపడానికి డ్రైవర్ ఉంటాడు. కానీ అర్ధరాత్రి అటవీ ప్రాంతంలో నల్లబెల్లం ఉందని ట్రైనీ ఎస్సైని మాత్రమే తీసుకెళ్లినట్లు సమచారం.. ఇతర సిబ్బంది ఉన్నా తీసుకెళ్లలేదు. 

ఎస్సై శ్రీనివాస రెడ్డి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆ ట్రైనీ ఎస్సై మహబూబాబాద్ పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించలేదు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి వరంగల్ సీపీ తరణ్ జోషిని కలిసి మంగళవారం ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేస్తూ నార్త్ జోన్ ఐజీ, వరంగల్ ఇన్ చార్జ్ డీఐజీ నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 

 

   

 

  

Leave a Comment