యువకుడిపై యువకుడు అత్యాచారం..!

సమాజం ఎటు పోతుంది.. సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేదనుకుంటే.. చివరికి మాగాళ్లకు కూడా రక్షణ లేకుండా పోతుంది. కళ్లు మూసుకుపోయిన ఈ కామాంధులు ఆడపిల్లలపైనే కాకుండా చివరికి మాగాళ్లను సైతం వదలట్లేదు. తాజాగా ఓ యువకుడిపై మరో వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. 

వివరాల మేరకు బెల్గామ్ జిల్లా కబాక గ్రామానికి చెందిన ఓ 20 ఏళ్ల యువకుడు శుక్రవారం సాయంత్ర 6 గంటల సమయంలో వాకింగ్ కి వెళ్లాడు. ఈక్రమంలో అదే గ్రామానికి చెందిన మొహ్మద్ హనీఫ్ అనే వ్యక్తి రైల్వే ట్రాక్ సమీపంలో యువకుడిని పలకరించాడు. పరిచయం ఉన్న వ్యక్తే కావడంతో ఆ యువకుడు కూడా అతనితో మాట కలిపాడు. అలా కొద్దిసేపటి తర్వాత చెరుకు రసం తాగిస్తానంటూ నమ్మబలికాడు. తర్వాత యువకుడిని పట్టుకుని చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. 

తర్వాత ఇంటికి వచ్చిన యువకుడు భయంతో వణికిపోవడం, దుస్తుల నిండా బురద ఉండటాన్ని అతడి తండ్రి గమనించాడు. కంగారుపడి ఏం జరిగిందో ఆ యుడకుడిని అడిగాడు. దీంతో ఆ యువకుడు ఏడుస్తూ జరిగిన విషయాన్ని తండ్రికి వివరించాడు. దీంతో అతడి తండ్రి హనీఫ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.  

Leave a Comment