సోదరితో అక్రమ సంబంధం.. వ్యక్తిని హత్య చేసి శవంతో పోలీస్ స్టేషన్ కి వెళ్లారు..!

బెంగళూరు అన్నపూర్ణేశ్వరినగర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. తన సోదరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. ఓ వ్యక్తిని హత్య చేశాడు. ఆపై అతడి శవాన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి లొంగిపోయాడు.. వివరాల మేరకు కోలారు జిల్లా మాలూరుకు చెందిన ఒక మహిళ గార్మెంట్స్ లో పనిచేసుకుంటుంది. ఆమె భర్త మాలూరులోనే ఉండగా.. ఆమె మాత్రం అన్నపూర్ణేశ్వరినగర చంద్రశేఖర్ లేఔట్ లో నివాసం ఉంటుంది. 

ఈక్రమంలో ఆమెకు తమిళనాడుకు చెందిన భాస్కర్ అనే వ్యక్తితో రెండే క్రితం పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. దసరాకు భర్త వద్దకు మాలూరుకు వెళ్లింది. ఈసమయంలో అక్రమ సంబంధంపై  భర్త నిలదీశాడు. వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఇక బెంగళూరు వెళ్లొద్దని భర్త ఆ మహిళకు చెప్పాడు. 

భర్త మాటను లెక్కచేయకుండా ఆమె తన చిన్న కొడుకును తీసుకొని బెంగళూరుకు వెళ్లిపోయింది. బెంగళూరు వచ్చిన ఆమె శనివారం సాయంత్రం ప్రియుడు భాస్కర్ ను కలిసింది. ఈ విషయాన్ని ఆమె కొడుకు తన మేనమామ మునిరాజుకు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే మునిరాజు తన స్నేహితులు మారుతీ, నాగేశ్, ప్రశాంత్ లతో కలిసి అక్కడకు చేరుకున్నాడు. తన సోదరీ, భాస్కర్ ఆటోలో వెళ్తుండగా వారిని అడ్డుకున్నారు. తన సోదరిని ఇంటికి పంపించి.. భాస్కర్ ను తీవ్రంగా కొట్టారు. ఆ దెబ్బలకు భాస్కర్ ప్రాణాలు కోల్పోయాడు. భాస్కర్ మృతదేహాన్ని అదే ఆటోలో తీసుకుని అన్నపూర్ణేశ్వరినగర పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకున్నారు. 

Leave a Comment