కరోనా మహమ్మారి నేపథ్యంలో ఫిట్ బాడీని నిర్వహించడం ప్రాముఖ్యతను అందరికీ తెలియజేసేందుకు ఓ యువకుడు సాహసం చేశాడు. ఏకంగా నీటి అడుగున అనేక వ్యాయామాలు చేశాడు.. పాండిచ్చెరికి చెందిన అరవింద్ గత 20 ఏళ్ల నుంచి చెన్నై, పాండిచ్చెరి తీరంలో డైవింగ్ ప్రచారం నిర్వహిస్తున్నారు.
అరవింద్ వ్యాయామంపై అవగాహన పెంచేందుకు సముద్రంలో 14 మీటర్ల నీటి అడుగున కంటి గేర్ రక్షణతో సముద్రపు అడుగున ఉన్న బెడ్ పై వ్యాయామాలు చేశారు. శరీరంతో పాటు ఊపిరితిత్తులను ధృఢంగా ఉంచడం కోసం ప్రతిరోజూ 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని అరవింద్ తెలిపారు. శ్వాస వ్యాయామాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయని అన్నారు.
ప్రాణాంతక వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే మాస్క్ ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం చాలా ముఖ్యమని, అయితే శరీరం, మనస్సు బలంగా ఉండటానికి శారీరక వ్యాయామాలు చేయాలని సూచించారు. ఈ విషయాలను ప్రజలకు వివరించడానికే ఈ విధంగా సముద్రంలో వర్కౌట్స్ చేసినట్లు తెలిపారు.
Man from Puducherry does Exercise 14 more deep water to emphasize on need of exercise during pandemic.
Does Dumbell curls and Barbell curls under water as fishes swim by.. pic.twitter.com/pCVbx6O1H5
— Pramod Madhav♠️ (@PramodMadhav6) May 10, 2021