బర్రెపై అత్యాచారం చేస్తూ.. తోక మెడకు చుట్టుకుని మృతి..!

కొందరు మనుషుల్లో మృగాలు ఉంటాయి.. మహిళలే కాదు నోరు లేని పశువులపై అఘాయిత్యాలకు పాల్పడేవారు అక్కడక్కడ కనిపిస్తారు. అయితే వారి పాపం వారికే శాపమవుతుంది. తాజాగా బర్రెపై అత్యాచారం చేస్తూ తోక మెడకు చుట్టుకుని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. 

వనపర్తి జిల్లా కేంద్రంలోని నాగవరంలో 45 ఏళ్ల ఆంజనేయులు కూలీ పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ఆంజనేయులుకు పశువులపై అత్యాచారం చేసే అలవాటు ఉంది. ఈనేపథ్యంలో నాగవరంలోని బాల్ రెడ్డికి చెందిన బర్రెల కొట్టంలోకి ఆంజనేయుడు వచ్చాడు. శుక్రవారం రాత్రి బర్రెతో కోరిక తీర్చుకుంటుండగా తోక మెడకు బిగుసుకుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. 

శనివారం ఉదయం కొట్టంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలపారు. కాగా గతంలోనూ ఆంజనేయులు పశువులపై అత్యాచారం చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో స్థానికులు దేహశుద్ధి చేశారు.  

Leave a Comment