వ్యక్తి ప్రాణాలు తీసిన మిర్చి బజ్జి..!

సాయంత్రం సమయంలో వేడి వేడి మిర్చి బజ్జి తింటుంటే ఆ మజానే వేరు.. కానీ అదే మిర్చి బజ్జి ఓ వ్యక్తి ప్రాణాన్ని తీసింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. మిడ్జిల్ మండలం వేముల గ్రామానికి చెందిన మల్లేశ్(40) కొంతకాలంగా హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు. ఈక్రమంలో పనుల నిమిత్తం సొంత గ్రామానికి వచ్చాడు. రాత్రి సమయంలో హోటల్ నుంచి మిర్జి బజ్జీలు తెచ్చుకుని ఇంటి డాబాపై కూర్చొని తింటున్నాడు. ఈక్రమంలో మిర్చి బజ్జి గొంతులో ఇరుక్కుంది. దీంతో మల్లేశ్ చనిపోయాడు. 

అయితే రాత్రి కావడంతో మల్లేశ్ ఇంటిపైనే నిద్రపోయాడని కుటుంబ సభ్యులు అనుకున్నారు. ఉదయం మల్లేశ్ డాబాపై నుంచి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూశారు. అప్పటి మల్లేశ్ మృతి ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బజ్జీ గొంతులో అడ్డుపడటంతోనే మల్లేశ్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. 

 

Leave a Comment