దేవిశ్రీ ప్రసాద్ ఇంట్లో వరుస విషాదాలు..!

టాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఇంట్లో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయి. ఆయన బాబాయి బాల్గానిన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇంతలోనే మరో వార్త ఆయన కుటుంబ సభ్యులను శోకసంద్రంలోకి నెట్టేసింది. 

దేవిశ్రీ ప్రసాద్ మరణవార్త వినగానే ఆయన మేనత్త కోమ్ముల సీతామహాలక్ష్మీ గుండెపోటుతో చనిపోయారు. దీంతో దేవిశ్రీ ప్రసాద్ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా దేవిశ్రీ ప్రసాద్ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురం దగ్గర వెదురుపాక.. వారిది శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం. ఇదిలా ఉండగా దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం పలు క్రేజీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్పతో పాటు పలు సినిమాలకు సంగీతం అందిస్తూ బిజీగా ఉన్నారు.  

Leave a Comment