సీఎం జగన్ కు తాగుబోతుల వార్నింగ్..!

మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. ఒకటి, రెండు మినహా అన్ని స్థానాలను క్వీన్ స్వీప్ చేసింది. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం జరిగింది. అయితే కర్నూలు జిల్లా నంద్యాలలోని 29వ వార్డులో ఓటర్ల లెక్కింపు సందర్భంగా ఆసక్తికర ఘటన జరిగింది. 

బ్యాలెట్ బాక్సుల్లో ఓటుతో పాటు కొన్ని స్లిప్పులు వచ్చాయి. ఓటర్లు తాము ఎదుర్కొంటున్న సమస్య గురించి వినతి పత్రాలను బ్యాలెట్ బాక్సులో వేశారు. అదెదో రోడ్లు, తాగునీ,రు, డ్రైనేజీ సమస్యలు కావండి.. తాగుబోతులు తమకు కావాల్సిన లిక్కర్ బ్రాండ్లు అమ్మాలని అందులో కోరారు. 

letter

ఆ వినతిపత్రంలో ఏముందంటే..‘గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్న గారికి తాగుబోతుల యొక్క విన్నపం ఏమనగా.. కొత్త బ్రాండ్స్(Ex : Supereme, Daru, Hyd, JUMBO etc..) ను తొలగించి ఓల్డ్ బ్రాండ్లు (Ex : ROYAL STAG, Imperiar Blue, BLACK DOG etc)లను అమ్మవలెనని విన్నపం. లేకపోతే మా యొక్క చివరి ఓటు కాగలవని విన్నవించుకుంటున్నాము’ అని ఆ పత్రంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Leave a Comment