కరోనాతో మహాత్మా గాంధీ మునిమనవడు మృతి..!

కరోనాతో మహాత్మా గాంధీ మునిమనవడు సతీష్ ధుపేలియా(66) మృతి చెందారు. సౌత్ ఆఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్ లో మరణించినట్లు ఆయన సోదరి ఉమా ధుపేలియా పేర్కొన్నారు. సతీష్ న్యుమోనియాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారని, ఆస్పత్రిలో చేరిన తన సోదరుడికి కరోనా సోకిందని ఉమా తెలిపారు. 

ఆయన నెలరోజులుగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని, చికిత్స పొందుతున్న సతీష్ కు హఠాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందారని ఆమె వెల్లడించారు. ఆయనతో పాటు సోదరి ఉమా, మరో సోదరి కీర్తి మీనన్ జోహన్నెస్ బర్గ్ లో నివసిస్తున్నారు. వీరు ముగ్గురు మహాత్మ గాంధీ రెండో కుమారుడు మనీలాల్ గాంధీ వారసులు..

Leave a Comment