మూడేళ్లు ప్రేమించి మరో అమ్మాయితో నిశ్చితార్థం.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య..!

మూడేళ్ల పాటు ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకుంటానని మాటిచ్చాడు. ఇప్పుడు ప్రేయసిని మోసం చేసి మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 

ఓదెల గ్రామానికి చెందిన అల్లం ప్రసన్న(21) హన్మకొండలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన రాంనేని సందీప్ అనే యువకుడు, ప్రసన్న మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకుంటానని మాటిచ్చాడు. ఇటీవల సందీప్ మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. దీంతో మనస్తాపం చెందిన ప్రసన్న సోమవారం ఉదయం ఇంట్లో పురుగుల మందు తాగింది. ఆమెను వెంటనే కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించింది. మృతురాలి తండ్రి అల్లం రమేశ్ ఫిర్యాదు చేయడంతో సందీప్ అతడి తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

 

Leave a Comment