తెలంగాణలో మరో దారుణం: యువతిపై నలుగురు అత్యాచారం..ఆస్పత్రి గదిలో మద్యం తాగించి..!

రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. వరుసగా అత్యాచార ఘటనలు జరుగుతుండడంతో ఆందోలళ కలిగిస్తోంది. ఇటీవల సైదాబాద్ సింగరేణి కాలనీ ఘటన మరువకముందే తెలంగాణలో మరో దారుణం చోటుచేసుకుంది. తాజాగా ఆస్పత్రి గదిలో ఓ యువతికి మద్యం తాగించి ఆమెపై నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది.

నిజామాబాద్ లో యువతిపై నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. యువతికి మద్యం తాగించి, దారుణానికి ఒడిగట్టారు. ఓ ఆస్పత్రి గదిలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. ఈఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే అక్కడికి వెళ్లి యువతిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతి షాక్ లో ఉన్నట్లు తెలుస్తోంది. యువతికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆమె స్పృహలో లేదని,  స్పృహలోకి రాగానే వాంగ్మూలం తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

 

Leave a Comment