వైసీపీకి భయమేంటో చూపిస్తా.. కలుపు మొక్కలను పీకేస్తా.. పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలకు భయమేంటో నేర్పిస్తానని, కులాల చాటున్న దాక్కుంటే లాక్కొచ్చి కొడతానని వార్నింగ్ ఇచ్చారు. బుధవారం జరిగిన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ప్రజలకు ఏదో చేస్తారని నమ్మి 2019 ఎన్నికల్లో 151 స్థానాలను కల్పించారని, వచ్చే ఎన్నికల్లో ఆ సీట్లు 15కు చేరుతాయని అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎవడితో పడితే వాడితో ఇష్టమొచ్చినట్లు తిడితే సహించబోమని పవన్ హెచ్చరించారు.

వైసీపీ దుష్టపాలనకు అంతమొందిచాల్సిన సమయం ఆసన్నమైందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తాను రాజకీయాల్లోకి ఇష్టంతో వచ్చానని, పొలంలో కలుపు మొక్కలను పీకినట్లే.. రాజకీయాల్లో కలుపు మొక్కలను పీకేస్తానని వైసీపీ నాయకులను హెచ్చరించారు. రాబోయే కాలంలో జనసేన పార్టీ మరింత వ్యూహాత్మకంగా ముందుకెళ్తుందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పరిస్థితి ఏంటో అనుభవం ఉండేలా తెలియజేస్తానని అన్నారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి వైసీపీ అక్రమాలను దేశ అధినాయకులకు చెబుతున్నాన్నారు. 150 దేవాలయాలపై దాడి చేస్తే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోదా అని ప్రశ్నించారు. 

 

Leave a Comment