యాంకర్లు చేసిన పనికి.. లైవ్ లో ఏడ్చేసిన కృతిశెట్టి..!

ఉప్పెన సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయన్ కృతిశెట్టి.. ఈ భామకు ఇప్పుడు తెలుగు, తమిళ సినిమాల్లో మంచి అవకాశాలు దక్కుతున్నాయి. తాజాగా కృతిశెట్టికి ఓ చేదు అనుభవం ఎదురైంది. ఓ ఇంటర్వ్యూలో ఇద్దరు యాంకర్లు అతి చేయడం వల్ల లైవ్ లోనే ఏడ్చేసింది కృతిశెట్టి..

ఏం జరిగిందంటే.. ఓ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్న కృతిశెట్టి.. అనంతరం ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఇద్దరు యాంకర్లు పాల్గొన్నారు. వారిలో ఒక యాంకర్ కృతిశెట్టిని ప్రశ్నలు అడిగారు. మరో యాంకర్ కి ప్రశ్నలు వేసే అవకాశం ఇవ్వలేదు. దీంతో మరో యాంకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు..

నువ్వు అన్ని ప్రశ్నలు అడిగితే.. నేనెందుకు ఇక్కడా? ఈ ప్రొగ్రామ్ డైరెక్టర్ ఎవరూ? కెమెరా ఆఫ్ చేయండి అంటూ గట్టిగా కేకలు వేశాడు. దీంతో ఇద్దరు యాంకర్లు వాగ్వాదానికి దిగారు. ఇది చూసి షాకైన కృతిశెట్టి.. కన్నీళ్లు పెట్టుకుంది. లైవ్ లోనే ఏడ్చేసింది. దీంతో యాంకర్లు ఇద్దరు ఇది కేవలం ప్రాంక్ మాత్రమే కృతిశెట్టిని ఓదార్చారు. ఎవరైనా గట్టిగా మాట్లాడితే తనకు భయమని కృతిశెట్టి తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. 

Leave a Comment