దేశవ్యాప్తంగా లాక్డౌన్ను కేంద్రం మరోసారి పొడిగించింది. అయితే, కేవలం కంటైన్మెంట్ జోన్ల వరకే పరిమితం చేసింది. జూన్ 30 వరకు కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. రేపటితో లాక్డౌన్ 4.0 ముగుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రకటించింది. అలాగే లాక్డౌన్ 5.0కు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను కేంద్రం ప్రకటించింది. దశలవారీగా కొన్ని మినహాయింపులను ప్రకటించింది. అయితే, రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రం కర్ఫ్యూ కొనసాగుతుందని పేర్కొంది. అంతర్ రాష్ట్ర రవాణా పై ఆంక్షలు ఎత్తివేసింది. ఆంధ్ర రాష్ట్రంలో జూన్ 8 తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం ప్రారంభమవుతుంది.
ఫేజ్-1
- జూన్ 8 నుంచి దేవాలయాలు, ప్రార్థనామందిరాలకు అనుమతి
- జూన్ 8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు, వసతి సేవలు, షాపింగ్ మాల్స్కు అనుమతి
ఫేజ్-2
- పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకే నిర్ణయాధికారం
- విద్యాసంస్థలు పునఃప్రారంభంపై జులైలో నిర్ణయం
- విద్యాసంస్థల పునఃప్రారంభం విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు ఇస్తుంది.
వీటికి అనుమతి లేదు..
- మెట్రో రైలు సేవలకు అనుమతి లేదు.
- అంతర్జాతీయ విమాన సేవలకు అనుమతి లేదు.
- సినిమాహాల్స్, జిమ్లు, స్విమ్మింగ్పూల్స్, పార్కులు, బార్లు, రాజకీయ, సామాజిక, క్రీడా కార్యక్రమాలపై ప్రస్తుతానికి అనుమతి లేదు.