దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మరో రెండు వారాల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. మే 4 నుంచి రెండు వారాల పాటు లాక్ డౌన్ అమల్లో ఉండనుంది. ఈ మేరకు లాక్ డౌన్ పొడిగిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రెండో దఫా లాక్ డౌన్ గడువు మే 3తో ముగియనుంది. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త మార్గదర్శకాలు కేంద్రం జారీ చేసింది. ఇక శనివారం ఉదయం 10 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. కరోనా కట్టడి కొనసాగింపు చర్యలపై మోడీ స్పష్టత ఇవ్వనున్నారు. అయితే కేంద్రం గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్లలో కొన్నిఆంక్షల సడలింపులు ఇచ్చింది.
లాక్ డౌన్ లో సడలింపులు ఇవే..
- విమానాలు, రైళ్లు, అంతరాష్ట్ర ప్రయాణాల నిషేధం
- స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు బంద్
- హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, జిమ్లు బంద్
- స్విమ్మింగ్ పూల్స్, స్టేడియంలు మూసి ఉంచాలి
- అన్ని ప్రార్థనా స్థలాలు, పబ్లిక్ ఈవెంట్లు రద్దు
- అన్ని జోన్లలో ఆస్పత్రులలో ఓపీ సేవలకు అనుమతి
- గ్రీన్ జోన్లు, ఆరేంజ్ జోన్లలో కొన్ని ఆంక్షలు సడలింపు
- రాత్రి 7గం.ల నుంచి ఉ.7గంటల వరకు కర్ఫ్యూ అమలు.
- వారంకు ఒకసారి రెడ్ జోన్లలో పరిస్థితి పరిశీలన
- కేసులు తగ్గితే రెడ్ జోన్లను గ్రీన్ జోన్లుగా మార్పు.
- గ్రీన్, ఆరేంజ్ జోన్లలో సాధారణ కార్యకలపాలకు అనుమతి
- రాష్ట్రాల పరిధిలో బస్సులకు అనుమతిచ్చిన ప్రభుత్వం
- గ్రీన్ జోన్లలో ఉ.7 నుంచి సా.7వరకు వ్యాపారాలకు అనుమతి
- ఆరేంజ్ జోన్లలో వ్యక్తిగత వాహనాలకు అనుమతి
- ఆరేంజ్ జోన్లు: కార్లలో ఇద్దరు ప్యాసింజర్లకు అనుమతి
- ఆరేంజ్ జోన్లు: టూ వీలర్ మీద ఒక్కరికే అనుమతి
- ఆరేంజ్, గ్రీన్ జోన్లలో వ్యక్తిగత ప్రయాణాలపై ఆంక్షలు ఉండవు