లాక్ డౌన్ 5.0 మరో 2 వారాలు పొడిగింపు..!

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ 4.0 మే 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి మోడీ ఈనెల 31న మన్ కీ బాత్ లో జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో లాక్ డౌన్ 5.0 గురించి ప్రకటన చేయనున్నట్లు సమాచారం. దేశవ్యాప్త లాక్ డౌన్ ను కేంద్రం మరో 2వారాలు పొడిగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

అయితే లాక్ డౌన్ 5.0లో కేంద్రం అనేక సడలింపులను ఇవ్వనుంది. ప్రార్థనా మందిరాలతో పాటు జిమ్ లకు కూడా లాక్ డౌన్ 5.0లో తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చే అవకాశమున్నట్లు సమాచారం. అయితే సోషల్ డిస్టెన్స్, మాస్క్ లు ధరించడం మాత్రం తప్పనిసరిగా ఉండనుంది. పబ్లిక్ గేథరింగ్ కు అనుమతిచ్చే అవకాశం లేదు.

 ఈ లాక్ డౌన్ 5.0 సమయంలో ఎటువంటి పండుగలు, ఉత్సవాలకు అనుమతించే అవకాశం కూడా లేదు. విద్యాసంస్థలు, సినిమా థిమేటర్లు, మాల్స్ ఎప్పటిలాగే మూసివేయబడి ఉండనున్నాయి.పెళ్లిళ్లు మరియు అంత్యక్రియలు వంటి వాటికి పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రజలు హాజరయ్యే వీలు ఉంటుంది. హోంమంత్రిత్వశాఖ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం….ముఖ్యంగా దేశంలోని 70 శాతం కరోనా కేసులు ఉన్న 11సిటీలపై లాక్ డౌన్ 5.0ఫోకస్ ఉంటుంది.

ఢిల్లీ,ముంబై,చెన్నై,ఇండోర్,పూణే,బెంగళూరు,థానే,అహ్మదాబాద్,జైపూర్,సూరత్,కోల్ కతా సిటీలపై జూన్-1నుంచి ప్రారంభమయ్యే లాక్ డౌన్ 5.0ఫోకస్ ఉంటుంది. ఈ సిటీల్లో కరోనా ప్రభావం అధికంగా ఉన్న విషయం తెలిసిందే. దేశంలో ఇప్పటి వరకు నమోదైన 1.51లక్షల కోవిడ్-19 కేసుల్లో 60శాతం కేసులు ఢిల్లీ, అహ్మదాబాద్, కోల్ కతా, ముంబై, పూణేలోనే నమోదయ్యాయి. అంతకుముందు దేశవ్యాప్తంగా 80శాతం కరోనా కేసులున్న 30మున్సిపల్ కార్పొరేషన్ల ఏరియాల లిస్ట్ ను కేంద్రం రెడీ చేసింది.

 

Leave a Comment