ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేం : మంత్రి గౌతమ్ రెడ్డి..

కరోనా వైరస్ కారణంగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నవంబర్ లో నిర్వహించే పరిస్థితి లేదని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలో జరిగిన స్టేట్ లెవెల్ బ్యాంకర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా కొంత తగ్గినట్టు ఉన్నా మళ్లీ వచ్చే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారని వెల్లడించారు.  

నవంబర్ నెలలో కరోనా కేసులు పెరగవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. బీహార్ వంటి రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. అయితే మన దగ్గర జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు కొంత వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు. కాబట్టి ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు.   

Leave a Comment