వర్షం వస్తున్న సమయంలో చెట్టు కింద నిలబడ్డ నలుగురిపై పిడుగు పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా, ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన హర్యానాలోని గురుగ్రామ్ లో శుక్రవారం చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూస్తే ఒళ్లుగగురపొడిచే విధంగా ఉంది.
గుర్గావ్ సెక్టార్ 82లోని సిగ్నేచర్ విల్లాస్ అపార్ట్ మెంట్ సముదాయం దగ్గర శుక్రవారం ఉదయం నుంచి ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో వర్షంలో తడవకుండా ఉండేందుకు నలుగురు వ్యక్తులు చెట్టు కిందకు వచ్చారు. ఆ సమయంలో అకస్మాత్తుగా పిడుగు పడింది.
ఈక్రమంలో ముగ్గురు వ్యక్తులు క్షణాల్లో కిందపడిపోయారు. అయితే చెట్టుకు ఆనుకుని ఉన్న మరో వ్యక్తి కొద్ది సేపటి తర్వాత కుప్పకూలిపోయాడు. ఈ ఘటనలో ఒకరు మరణించగా, ముగ్గురికి గాయాలయ్యాయి. చుట్టు పక్కల వారు.. వారిని ఆస్పత్రికి తరలించారు. పిడుగు పడిన దృశ్యాలు సమీపంలోని సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయింది.
Deadly Lightening in Gurgaon pic.twitter.com/nHygeNH3jX
— Sheela Bhatt शीला भट्ट (@sheela2010) March 12, 2021