సమన్వయంతో ముందుకు వెళదాం..

 ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్  జస్టీస్ కనగ రాజ్

ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ విధుల్లో భాగస్వామ్యం అవుదామని ఏపీ ఎన్నికల కమిషనర్ జస్టిస్ వి.కనగ రాజ్ తెలిపారు. ఆర్ అండ్ బి భవన్ లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో సోమవారం  అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ కనగరాజ్ మాట్లాడుతూ 

 ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా అందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. 

 రాష్ట్రంలో , దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అసాధారణ పరిస్థితి నెలకొందన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం స్థాపన లో పంచాయతీ రాజ్ వ్యవస్థ కీలకమైన పాత్ర పోషింస్తుందన్నారు. చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు చేరాలని, స్థానిక సంస్థలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 

ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి కీలక భూమిక పోషిస్తుందన్నారు. చక్కటి అవగాహనతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు పేరు తీసుకురావడంలో రావడం లో  అధికారులు, సిబ్బంది సహాయ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల యాదార్ధ స్థితిని అధికారులు కమిషనర్ కి వివరించారు. 

 

Leave a Comment