కరోనా విషయంలో ఐక్యంగా పోరాడుదాం : చంద్రబాబు

Corona విజృంభణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్‌  చాలా మంచి నిర్ణయమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 14 రోజుల నుంచి 25 రోజుల్లోగా ఎప్పుడైనా వైరస్ బయట పడుతుందని చెప్పారు.

ఈ వైరస్‌తో దేశంలో ఇప్పటికే 590 మంది మృతి చెందారని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో సోమవారం అత్యధికంగా కేసులు నమోదయ్యాయని, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేసులు పెరిగాయని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో ఓ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వానికి చాలా సార్లు చెప్పానని, అయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది వైసీపీకి చెందిన సొంత విషయం కాదని, ఇది ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన విషయమని చెప్పారు. ఈ పోరులో అందరం కలిగి పోరాడాలన్నారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం రాష్ట్రానికి, దేశానికి మంచిది కాదన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దన్నారు. 

Leave a Comment