Covid -19 నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్లైన్ ట్రైనింగ్ (iGOT ) కార్యక్రమం రూపొందించింది. ఇందులో భాగంగా ఆరోగ్య సంరక్షణ నిపుణులు, ఆరోగ్యేతర ప్రొవైడర్లకు శిక్షణ ఇచ్చేందుకు అన్నీ ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్ ఒక ప్రకటనలో తెలిపారు.
అన్నీ స్థాయిలలో వున్నా ఆరోగ్య, ఆరోగ్యేతర ప్రొవైడర్ లకు కోవిడ్ -19 (కరోన) నిర్వహణపై శిక్షనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ సిబ్బంది శిక్షణ విభాగం క్లౌడ్ బేస్డ్ నైపుణ్య సామర్ధ్యాన్ని పెంచేందుకు అన్నీ చర్యలు తీసుకుందన్నారు. స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్, లాప్ టాప్స్ ద్వారా అవసరమైన శిక్షణ మెటీరియల్ ఇస్తారన్నారు.
ఈ ట్రైనింగ్ మోడ్యుల్స్ ను https://igot.gov.in నుంచి పొందవచ్చని తెలిపారు. ఈ శిక్షణలో సిబ్బంది అవసరాలకు తగ్గట్టుగా కార్యక్రమాన్ని రూపొందించారని, .ప్రాంతం వారి గా, వృతి వారిగా ట్రైనింగ్ మోడ్యుల్స్ వారి అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.
కోవిడ్ -19 వారియర్ డాష్ బోర్డులో వివిధ రాష్ట్రాల వారిగా, జిల్లాల వారిగా డాక్టర్ లు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల వివరాలను మాస్టర్ డేటాబేస్ లో పొందుపరచారన్నారు. కోవిడ్- 19 వారియర్ డాష్ బోర్డులో సురక్షిత లాగిన్ అవడం ద్వారా ముఖ్యకార్యదర్శులు, మిషన్ హెడ్స్, జిల్లా కలెక్టర్లు, కమిషనర్లు, కోవిడ్ నోడల్ అధికారులు ఎప్పటికప్పుడు వివరాలను తెలుసుకోవచ్చని తెలిపారు.
కోవిడ్ నిర్వహణలో నిమగ్నమైన అధికారులు, సిబ్బంది ఈ వేదికలో కొత్త కోర్సుల గురించి వివరాలను తీసుకోవడంతో పాటు తమని తాము సరికొత్త పరిణామాలతో అప్ డేట్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇతర వివరాలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నోడల్ జాయింట్ సెక్రటరీ నెంబర్ కు 09650307575 లేదా email [email protected] సంప్రదించవచ్చని తెలిపారు.