‘సర్ ప్రైజ్ అంటూ చున్నీతో గంతలు కట్టి’.. కాబోయే భర్త గొంతు కోసిన యువతి..!

అనకాపల్లి జిల్లాలో దారుణం జరిగింది.. పెళ్లి ఇష్టం లేక ఓ యువతి తనకు కాబోయే భర్త గొంతు కోసేసింది.. ఎవరూ లేని ప్రదేశంలోకి తీసుకెళ్లి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని చెప్పి పెళ్లి చేసుకోబోయే వాడి గొంతు కోసింది.. వివరాల మేరకు వి.మాడుగుల మండలం ఘాట్ రోడ్డుకు చెందిన అద్దెపల్లి రామునాయుడుకు(28), రావికమతానికి చెందిన వియ్యపు పుష్ప(22)తో ఇటీవల నిశ్చతార్థం జరిగింది.  

మే నెల 20న వీరి పెళ్లి జరగాల్సి ఉంది. రామునాయుడు హైదరాబాద్ లోని సీఎస్ఐఆర్ లో పరిశోధకుడిగా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న పుష్ప..సోమవారం ఉదయం యువకుడికి ఫోన్ చేసింది. దీంతో రామునాయుడు రావికమతం వెళ్లాడు. 

ఇద్దరు కలిసి వడ్డాది, కోమళ్లపూడి దగ్గరలోని జ్యోతిర్మయి బాబాదివ్యక్షేత్రాన్ని సదర్శించారు. అక్కడ కాసేపు సరదాగా గడిపారు. తర్వాత యువకుడి కళ్లకు చున్నీతో గంతలు కట్టింది. సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని చెప్పింది. తన వెంట తెచ్చుకున్న కత్తితో యువకుడి గొంతు కోసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో భయాందోళనకు గురై ఆ యువకుడిని తానే స్కూటీపై వైద్యం కోసం రావికమతం ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చింది. 

పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు యువకుడిని అనకాపల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.  ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు ఆ యువకుడి వాంగ్మూలం తీసుకున్నారు. కాబోయే భార్య తన గొంతు కోసిందని, తానంటే ఆమెకు ఇష్టం లేదని చెప్పిందని రామునాయుడు తెలిపాడు.   

 

 

 

Leave a Comment