ఏపీలో నేటి నుంచి భూముల రిజిస్ట్రేషన్ కు అనుమతి

 కరోనా వైరస్ ప్రభావంతో విధించిన లాక్ డౌన్ కారణంగా ఏపీలో మూతపడిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను సడలింపుల్లో భాగంగా నేటి నుంచి తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మద్యం దుకాణాలను తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం రెడ్ జోన్ల బయట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తెరిచేందుకు ఆదేశాలు ఇచ్చింది. 

లాక్ డౌన్ కారణంగా నెలన్నర రోజులుగా ప్రభుత్వం భారీగా ఆదాయం కోల్పోయింది. రిజిస్ట్రేషన్లకు అనుమతివ్వడం ద్వారా తిరిగి ఆదాయాన్ని రాబట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. 

మార్గదర్శకాలు ఇవే..

  • కార్యాలయంలో ఉద్యోగులతో పాటు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారు కూడా తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలి.
  • ఆరు అడుగుల దూరాన్ని పాటిస్తూ కార్యకలాపాలు సాగాలి.
  • రిజిస్ట్రేషన్ కోసం ముందుగా వచ్చే వారికి ముందుగా అనుమతి ఇవ్వాలని రిజిస్ట్రార్లకు సూచించింది. 
  • ఉద్యోగుల హాజరు కోసం వాడే బయోమెట్రిక్ యంత్రాలను రోజూ శానిటైజ్ చేయాలి.
  • పది మంది కంటే ఎక్కువగా గుమిగూడ కుండా ఉంచాలి. 
  • ఆఫీసులను రోజూ డిస్ ఇన్ ఫెక్షన్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో సూచించింది.
  • ఇతరులు ఎవరినీ కార్యాలయాలకు అనుమతించరాదని ఆదేశించింది.

 

Leave a Comment