పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెబుతాం..

ఉగ్రవాద చర్యలకు మరియు కాల్పుల విరమణ ఉల్లంఘలకు పాల్పడినందుకు భారత సైన్యం దీటుగా బదులిస్తుందని ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవాణే పాకిస్తాన్ ను హెచ్చరించారు. హంద్వారాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలర్పించిన సిబ్బంది పట్ల భారత జాతి గర్విస్తోందని నరవాణే పేర్కొన్నారు. 

ముఖ్యంగా కమాండింగ్ ఆఫీసర్ అశుతోష్ శర్మ ముందుండి పౌరులకు ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ఆపరేషన్ పూర్తి చేశారని పేర్కొన్నారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు సంతాపం తెలిపారు. భారత్ లో అక్రమ చొరబాట్లకు ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ తీరుపై మండిపడ్డారు. దయాదీ దేశానికి సరైన బుద్ధి చెబుతామని నరవాణే హెచ్చరించారు. 

 

Leave a Comment