ఏపీలో కరోనా కేసులు వణుకుపట్టిస్తున్నాయి. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతునే ఉన్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 67 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1717కు చేరింది. ఇందులో గుజరాత్ నుంచి వారికి 14 పాజిటివ్ కేసులు వచ్చాయి.
అత్యధికంగా కర్నూలులో 25 కేసులు నమోదు కాగా, మొత్తంగా కర్నూలులో 516 కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో గుంటూరులో 13, కృష్ణాలో 8, విశాఖలో 2, అనంతపురంలో 2, కడపలో 2, నెల్లూరులో 1 కేసులు వచ్చాయి.
ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 589 మంది డిశ్చార్జ్ అయ్యారు. 34 మంది మరణించారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు 1094 మంది ఉన్నారు. గడచిన 24 గంటల్లో 8,263 శాంపిల్స్ ను పరీక్షించగా 67 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు.
జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య..
జిల్లా | కరోనా కేసుల సంఖ్య |
కర్నూలు | 516 |
గుంటూరు | 351 |
కృష్ణా | 286 |
నెల్లూరు | 92 |
చిత్తూరు | 82 |
అనంతపురం | 80 |
కడప | 89 |
ప్రకాశం | 61 |
పశ్చిమ గోదావరి | 59 |
తూర్పు గోదావరి | 45 |
విశాఖపట్నం | 37 |
శ్రీకాకుళం | 5 |
విజయనగరం | 0 |
ఇతరులు | 14 |
మొత్తం | 1717 |