జొమాటో గొడవ.. పరారీలో యువతి..!

కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న జొమాటో వివాదంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. జొమాటో డెలివరీ బాయ్ తనపై దాడి చేశాడని ఆరోపించిన హితేషా చంద్రానీ అనే యువతి ఇప్పుడు బెంగళూరు నగరం నుంచి పారిపోయింది. డెలివరీ బాయ్ కామరాజ్ ఎలక్ట్రానిక్స్ సిటీ పోలీస్ స్టేషన్ లో సదరు యువతి తనపై దాడి చేసిందని ఆరోపిస్తూ కేసు వేశాడు. అప్పటి నుంచి హితేసా పరారీలో ఉంది. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను విచారణకు హజరుకావాలని కోరారు. అయితే తాను బెంగళూరులో లేనని, మహారాష్ట్రలో బంధువుల ఇంటికి వెళ్లానని పోలీసులకు తెలిపింది. బెంగళూరు వచ్చాక విచారణకు హాజరు కవాలని పోలీసులు ఆమెను ఆదేశించారు. హితేషా విచారణకు హాజరుకాకపోతే ఆమెను అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.  

 

Leave a Comment