కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ ఐడీకి ఆధార్ అనుసంధానం చేయనున్నట్లు ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే క్రమంలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఓటర్ ఐడీతో ఆధార్ అనుసంధానం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
ఓటర్ ఐడీకి ఆధార్ అనుసంధానం చేయడం ద్వారా నకిలీ ఓట్లను గుర్తింవచ్చని తెలిపారు. ఓటు హక్కు పరిరక్షణకు వీలుగా ఆధార్ తో ఓటర్ ఐడీని అనుసంధానం చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇలా చేయడం ద్వారా ఎవరు ఓటు వేశారో.. ఎవరు వేయలేదో తెలుసుకునే అవకాశం ఉంటుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.