కర్నూలు జిల్లాలో పొలంలో రైతుకు రూ.1.20 కోట్ల వజ్రం లభ్యం..!

అదృష్టం ఏ రూపంలో ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు.. కానీ ఓ పేద రైతుకు మాత్రం వజ్రం రూపంలో అదృష్టం తలుపుతట్టింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చిన్నజొన్నగిరి గ్రామంలో గురువారం ఓ రైతులకు విలువైన వజ్రం లభించింది. వజ్రం రూపంలో అతడిని అదృష్టం వరించడంతో ఒక్క రోజులోనే కోటీశ్వరుడయ్యాడు. 

 వేరు శనగ విత్తనం విత్తేందుకు పొలాన్ని సిద్ధం చేసే క్రమంలో కంది కొయ్యలు తీస్తుండగా రైతుకు మెరుగురాయి కనిపించింది. అది వజ్రం అని తెలియడంతో వజ్రాల వ్యాపారులు అతని ఇంటికి వెళ్లారు. 25 క్యారెట్లు ఉన్న ఆ వజ్రాన్ని ఓ వ్యాపారి పోటీపడీ రూ.1.20 కోట్లకు కొనుగోలు చేశాడు. ఆ వజ్రం విలువ మార్కెట్ లో రూ.3 కోట్లు పైనే ఉంటుందట..

Leave a Comment