ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి : చిరంజీవి

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిన మహానేత దివంగత ఎన్టీఆర్ 98వ జయంతి నేడు.. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. తెలుగుజాతి కీర్తి కిరీటాలను దశదిశలా వ్యాపింప చేసిన ఘనుల్లో ఎన్టీఆర్ ఒకరు.. 

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు. ప్రముఖ గాయకులు నవయుగ వైతాళికులు భూపేన్ హజారికా గారికి  మరణాంతరం భారతరత్న ఇచ్చినట్టు, మన తెలుగు తేజం, దేశం గర్వంచే నాయకుడు నందమూరి తారక రామారావు గారికి భారత రత్న ఇవ్వాలని చిరంజీవి కోరారు. 

ఎన్టీఆర్ కు భారతరత్న ఇస్తే తెలుగువారందరికీ గర్వకారణమన్నారు. ఎన్టీఆర్ 100వ జయంతి దగ్గర పడుతున్న సందర్భంగా ఆయనకు ఈ గౌరవం దక్కితే అదే తెలుగు వారికి దక్కే గౌరవం అవుతుందన్నారు. ఆ మహానుభావుడిని 98వ జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటున్నా అంటూ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.. 

Leave a Comment