ఈ దోశ తింటే.. రూ.71 వేలు మీవే..!

చాలా మందికి ఇష్టమైన వంటకాల్లో దోశ ఒకటి. దోశలను చాలా ఇష్టంగా లాగేస్తుంటారు. అలాంటి ఆహార ప్రియులకు ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ ఈటింగ్ ఛాలెంజ్ నిర్వహిస్తోంది.. ఆ రెస్టారెంట్ లో పెట్టే దోశను తింటే రూ.71 వేలు ప్రైజ్ మనీని ప్రకటించింది. అయితే అందుకు కొన్ని కండిషన్స్ పెట్టింది ఆ రెస్టారెంట్..

ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లోని శక్తిసాగర్ రెస్టారెంట్ ఈ ఆఫర్ ని ప్రకటించింది. ఇంతకు ఛాలెంజ్ ఏంటంటే.. ఆ రెస్టారెంట్ లో తయారయ్యే 10 అడుగుల దోశను కేవలం 40 నిమిషాల్లోనే తినాలి.. ఒక వేళ తింటే ఆ రెస్టారెంట్ రూ.71 వేలు ప్రైజ్ మనీని అందజేస్తుంది. ఒకవేళ ఈ పోటీలో ఓడిపోతే మాత్రం రూ.1500 ఆ రెస్టారెంట్ కి చెల్లించాల్సి ఉంటుంది.. 

ఈ పోటీ చెప్పడానికి సింపుల్ గానే ఉంది. ఆ ఏముంది దోశే కదా తినేస్తామ అనుకుంటారు.. కానీ ఇది అంత తేలిక కాదు. ఈ పోటీలో పాల్గొన్న ఒక్కరు కూడా విజయం సాధించలేదు. 30 కంటే ఎక్కువ మంది ఈ పోటీలో పాల్గొన్నట్లు సమాచారం. ఈ పోటీలోె పాల్గొనేందుకు వేర్వేరు ప్రాంతాల నుంచి భోజన ప్రియులు ఢిల్లీకి వస్తున్నారు. ఈ పోటీలో పాల్గొని తమ లక్ ని పరీక్షించుకుంటున్నారు.   

Leave a Comment