రాజకీయాల్లోకి ఎప్పటికీ రాను : కేటీఆర్ కొడుకు హిమాన్షు

రాజకీయాల్లో ఎంట్రీపై మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు క్లారిటీ ఇచ్చాడు. తాను ఎప్పటికీ రాజకీయాల్లోకి రానని ట్వీట్టర్ ద్వారా స్పష్టం చేశాడు. తనకు రాజకీయాల మీద ఏమాత్రం ఆసక్తి లేదని, తన కల వేరే ఉందని చెప్పారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. 

‘ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నేను ఎప్పటికీ రాజకీయాల్లోకి రాను. ఎందుకంటే నా లక్ష్యాలు, నేను సాధించాల్సినవి చాలా ఉన్నాయి’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Leave a Comment