పింగళి వెంకయ్యకు భారత రత్న ఇవ్వండి.. ప్రధానికి సీఎం జగన్ లేఖ..!

జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యకు భారత రత్న ఇవ్వాలని సీఎం జగన్ కోరారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఆయనకు భారత రత్న ఇస్తేనే గుర్తింపు వస్తుందని, అజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుగుతున్న సందర్భంగా పింగళి వెంకయ్యకు భారత ఇవ్వడం సముచితమని పేర్కొన్నారు. 

 అంతకు ముందు గుంటూరు జిల్లా మాచర్ల లో నివాసం ఉంటున్న పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను సీఎం జగన్ స్వయంగా వెళ్లి కలిశారు. పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మికి ఘనంగా సత్కరించారు. ఆమెకు రూ.75 లక్షల చెక్కును అందజేశారు. అనంతరం పింగళి జీవిత విశేషాలతో కూడిన చిత్రాలను సీఎం జగన్ తిలకించారు. 

Leave a Comment