ఆనందయ్య మందుపై దుష్ప్రచారాలు వద్దు : వైసీపీ ఎమ్మెల్య కాకాణి

కృష్ణపట్నంలో ఆనందయ్య అందించేే ఆయుర్వేద మందుపై దుష్ప్రచారాలు చేయవద్దని సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కోరారు.. ఆనందయ్య మందుపై ఆయూష్ విభాగం పరిశీలించిందని, ఐసీఎంఆర్, కేంద్ర ఆయూష్ బృందం రేపు వస్తుందని తెలిపారు. 

ప్రభుత్వ అనుమతి వచ్చాకే ఆయుర్వేద మందు పంపిణీ చేస్తామన్నారు. ఆనందయ్య మందుపై లేనిపోని ఆరోపణలు చేసి, అనుమానాలు రేపోద్దని ఎమ్మెల్యే కాకాణి తెలిపారు. ఈ మందుపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని, త్వరలో అనుమానాలు నివృతి అవుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు రాద్ధాంతం చేయవద్దని ఆయన హితవు పలికారు..

Leave a Comment