భర్తతో వీడియో కాల్ మాట్లాడుతుండగా.. ఇంట్లోకి దూసుకొచ్చిన రాకెట్..!

ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య కొన్ని రోజులు పోరు తీవ్రమైంది. పాలస్తీనాలోని గాజాకు చెందిన హమాస్ ఉగ్రవాతులు ఇజ్రాయెల్ పైకి వరుస పేలుళ్లకు పాల్పడుతుండగా.. ఇజ్రాయెల్ ప్రతిగా గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది.. ఇరు ప్రాంతాల మధ్య జరిగిన దాడుల్లో 28 మంది పాలస్తీనియన్లు మరణించారు.

ఈ దాడిలో మరణించిన వారిలో కేరళకు చెందిన సౌమ్య అనే మహిళ ఉన్నట్లు తెలిసింది.. సౌమ్య మంగళవారం సాయంత్రం తమ రాష్ట్రంలో ఉన్న భర్త సంతోష్ తో వీడియో కాల్ లో మాట్లాడుతుండగా ఆమె ఇంటిపై రాకెట్ పడి ఇల్లు ధ్వంసమైంది. ఈ ఘటనలో సౌమ్య(31) ప్రాణాలు కోల్పోయింది.

కేరళలోని ఇడుక్కి జిల్లా కీరితోడుకు చెందిన ఎంఎస్ సౌమ్య ఏడేళ్లుగా ఇజ్రాయెల్ అష్కెలోన్ నగరంలో పని మనిషిగా చేస్తోంది. తాజాగా పాలస్తీనా జరిపిన రాకెట్ దాడిలో ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

 

Leave a Comment