జగన్ ప్రధాని కావాలనుకుంటున్నారు.. దీనిని ఏసుక్రీస్తు కూడా అంగీకరించరు : ఆర్ఆర్ఆర్

ఏపీ సీఎం జగన్ కు భారతదేశ ప్రధాని కావాలనే ఆశ ఉందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే పట్టించుకోకుండా.. కూడబెట్టిన డబ్బులతో ప్రధాని కావాలనుకుంటున్నారని విమర్శించారు. సీఎం జగన్ కోరికను పైనున్న దేవుళ్లు, ఆయన నమ్మిన ఏసుక్రీస్తు కూడా ఆంగీకరించరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

కరోనా బాధితులకు రాష్ట్రంలో తీరని  అన్యాయం జరుగుతోందన్నారు. కేవలం జగన్ నిర్లక్ష్యం వల్లే 46 మంది రోగులు మరణించారని ఆరోపించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇస్తున్నామంటూ జగన్ చేసిన ప్రకటనపై రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. 

సీఎం జగన్ ఏమైన ఆయన జేబులో నుంచి డబ్బులు ఇస్తున్నారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెడుతున్నారని, ఈ కేసులు జగన్ పై పెట్టాలని అన్నారు. కరోనా లెక్కలపై కూడా ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని, కేసులు విపరీతంగా పెరిగిపోతుంటే లాక్ డౌన్ పెట్టకుండా కర్ఫ్యూ పెట్టడమేంటని ఎద్దెవా చేశారు. 

Leave a Comment