ప్రాణం తీసిన ఫొటో షూట్.. నదిలో కొట్టుకుపోయిన కొత్త జంట..!

ఈమధ్య ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్, సేవ్ ది డేట్ షూట్ ఎక్కువైపోయాయి. అయితే ఈ ఫొటో షూట్ లో విషాదాన్ని నింపుతున్నాయి. రిస్క్ ట్రై చేసి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా కేరళలో పోస్ట్ వెడ్డింగ్ షూట్ లో ప్రమాదం జరిగింది. కోజికోడ్ సమీపంలోని కుట్టియాడికి చెందిన కొత్త జంట ఫొటో షూట్ చేస్తూ నదిలో కొట్టుకుపోయింది.

కడియంగడ్ కి చెందిన రెజిల్, కార్తీక్ కి మార్చి 14న పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత ఫొటో షూట్ కోసం కట్టియాడి నది వద్దకు వెళ్లారు. అక్కడ  ఫొటోలు దిగుతూ ప్రమాదవశాత్తూ నదీ ప్రవాహంలో కొట్టుకుపోయారు. వీరి కేకలు విన్న స్థానికులు నదిలోకి దూకి ఇద్దరినీ బయటకు తీశారు. అయితే అప్పటికే రెజిల్ చనిపోగా.. కార్తీక పరిస్థితి విషమంగా ఉంది.  

  

Leave a Comment