కేరళ టాక్సీ డ్రైవర్ కి లాటరీలో రూ.40 కోట్లు..!

అదృష్టం ఏ విధంగా తలుపు తట్టుతుందో చెప్పలేం.. ఓ టాక్సీ డ్రైవర్ కి మాత్రం లాటరీ రూపంలో అదృష్టం తలుపు తట్టింది. లాటరీలో ఏకంగా రూ.40 కోట్లు తగిలాయి.. కేరళకు చెందిన 37 ఏళ్ల రెంజిత్ సోమరాజన్ అబుదాబిలో 2008 నుంచి టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. 

సోమరాజన్ గత నెల 29న తన సహచరులైన 9 మందితో కలిసి తలా 100 దిర్హమ్ లు వేసుకుని తన పేరుపై లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. తాజాగా నిర్వహించిన డ్రాలో ఆ టికెట్ కు 3 కోట్ల దిర్హమ్ లు అంటే దాదాపు రూ.40 కోట్లు తగిలాయి. తొలుత ఈ విషయాన్ని నమ్మలేని అతడు తర్వాత తనకు దక్కిన అదృష్టాన్ని చూసి మురిసిపోతున్నాడు. తన సహచరుల్లో భారత్, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ వ్యక్తులు ఉన్నారని, వచ్చే మొత్తాన్ని అందరం సమానంగా పంచుకుంటామని సోమరాజన్ తెలిపాడు..

Leave a Comment