సాంబారు రుచిగా లేదని.. తల్లి, సోదరిని చంపేశాడు..!

ఈమధ్య చిన్న కారణాలతోనే హత్యలు చేయడం, ఆత్మహత్యలు చేసుకోవడం ఎక్కువయ్యాయి. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో ఆ కుటుంబాల్లో కన్నీరును మిగిలుస్తున్నాయి. తాజాగా సాంబర్ రుచిగా లేదని ఓ వ్యక్తి తన తల్లి, సోదరిని హతమార్చాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. 

వివరాల మేరకు ఉత్తర కన్నడ జిల్లాలోని డోడ్మణెలో నారయణ హస్లర్ అనే యువకుడు నివాసముంటున్నాడు. హస్లర్ మద్యం తాగి ఇంటికెళ్లాడు. ఆకలిగా ఉండటంతో భోజనం వేయాలని తల్లికి చెప్పాడు. తల్లి అతడికి అన్నం వడ్డించింది. అన్నంలో వడ్డించిన సాంబార్ రుచిగా లేకపోవడంతో అతనికి నచ్చలేదు. పైగా తల్లి, సోదరితో గొడవ పెట్టుకున్నాడు. ఈక్రమంలో తన వద్ద ఉన్న తుపాకీతో ఇద్దిరపై కాల్పులు జరిపాడు. దీంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.  

Leave a Comment