పిల్లలకు నిప్పంటించి.. తల్లీ కూడా ఆ మంటల్లోనే..!

కుటుంబ కలహాలతో కన్న బిడ్డలను తాళ్లతో బంధించి వారిపై కిరోసిన పోసి నప్పింటించి తానూ కాల్చుకుంది.. ఈ ఘటనలో తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోగా.. కొడుకు కాలిన గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ ఘటన కలబుర్గి నగరంలోని పంచశీల నగర్ లో చోటుచేసుకుంది. దీక్ష(26)కు, వసంత కుమార్ కు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు ధనంజయ్(4), కూతురు సించన(2) ఉన్నారు.

అయితే భర్త వసంత కుమార్ పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో పాటు కట్నం తీసుకురావాలని వేధించేవాడు. ఈ వేధింపులు తట్టుకోలేక దీక్ష తన కూతురు, కుమారుడిపై కిరిసిన్ పోసి నిప్పంటించి తాను అదే పనిచేసింది. ఈ ఘటనలో దీక్ష, కూతురు సించన సజీవంగా దహనమయ్యారు. కుమారుడు ధనంజయ్ ను స్థానికులు రక్షించారు. ప్రస్తుతం ఆ బాలుడు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.    

 

 

  

 

Leave a Comment