పచ్చని చెట్ల మధ్య భార్యతో ఎన్టీఆర్.. వైరల్ అవుతున్న ఫొటో..!

టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కు చెందిన ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తన భార్య లక్ష్మి ప్రణతితో కలిసి హాలిడే ఎంజాయ్ చేస్తున్న ఫొటోని ఆగస్ట్‌ 1న ఎన్టీఆర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ఆ ఫొటోలో పచ్చని చెట్ల మధ్య భార్య లక్ష్మి ప్రణతితో కలిసి ఉన్న తారక్‌ను చూడొచ్చు. ఇద్దరూ కాఫీ తాగుతూ ముచ్చట్లలో మునిగి తేలారు. ‘ఇలాంటి క్షణాలే కదా కావాల్సింది’ అన్నట్లుగా జూనియర్‌ ఎన్టీఆర్‌ ఈ ఫొటోకు క్యాప్షన్‌ ఉంచాడు. 

ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన నిమిషాల్లోనే ఈ ఫొటో వైరల్‌ అయింది. గంటలోపే సుమారు 3 లక్షల లైక్స్‌ రావడం విశేషం. కొన్ని వందల మంది కామెంట్స్‌ చేయగా.. అందులో చాలా మంది హార్ట్‌, ఫైర్‌ ఎమోజీలను పోస్ట్‌ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌కు 45 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. నిజానికి సోషల్ మీడియాలో తారక్‌ అంత యాక్టివ్‌గా కనిపించడు. ఇన్‌స్టాలోనూ చాలా రోజుల తర్వాత అతడు ఈ ఫొటో పోస్ట్‌ చేశాడు.

 

 

View this post on Instagram

 

A post shared by Jr NTR (@jrntr)

Leave a Comment