కరోనాతో జర్నలిస్ట్ TNR కన్నుమూత..!

ప్రముఖ జర్నలిస్ట్, యాంకర్, నటుడు తుమ్మల నరసింహారెడ్డి(TNR) కరోనాతో మృతి చెందారు. గత కొద్ది రోజులుగా కరోనాతో బాధపడుతున్న TNR సోమవారం కన్నుమూశారు.. కరోనా నిర్ధారణ కావడంతో మొదట ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నారు. తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మరణించారు. 

‘ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ TNR’ అంటూ తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ ఎంతో పాపులర్ అయ్యారు. యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. TNR మృతి పట్ల పలువురు ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. 

Leave a Comment