అందరూ రెండు మాస్కులు ధరించాలి : డీజీపీ గౌతమ్ సవాంగ్

కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. విజయవాడ నగరంలో ఆదివారం ఆయన కర్ఫ్యూ అమలును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రెండు మాస్క్ లు ధరించాలని, శానిటైజర్ ఉపయోగించాలని సూచించారు. 

జాగ్రత్తలు పాటించడం ద్వారానే కరోనాను జయిస్తామని డీజీపీ పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించేవారి కోసం రేపటి నుంచి ఈ-పాస్ విధానం అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు అనుమతి లేదని డీజీపీ స్పష్టం చేశారు. 

సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని డీజీపీ ప్రజలకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తదుపతి ఉత్తర్వులు వచ్చే వరకూ 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. శుభ కార్యాలయకు సంబంధించి ప్రభుత్వం పేర్కొన్న సంబంధిత స్థానిక అధికారుల వద్ద నిబంధనల మేరకు తప్పనిసరిగా అనుమతి పొందాలని తెలిపారు. 

Leave a Comment