కౌన్సిలర్‌‌గా నామినేషన్ వేసిన జేసీ

అనంతపురం: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలనం సృష్టించారు. తాను పనిచేసిన పదవి కంటే తక్కువ పోస్టుకు నామినేషన్ వేసి రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించారు. శాసనసభ సభ్యుడిగా పని చేసిన ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. తాడిపత్రి మున్సిపాలీటీ 30వ వార్డుకు కౌన్సిలర్‌గా నామినేషన్ వేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి తరపున ఆయన న్యాయవాదులు నామినేషన్ దాఖలు చేశారు. అయితే అదే వార్డులో జేసీ ప్రభాకర్‌రెడ్డిపై తాడిపత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పెద్ద కుమారుడు హర్షవర్ధన్ పోటీకి దిగడంతో మరోసారి తాడిపత్రిలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

 

Leave a Comment