కత్తి మహేశ్ కి జగన్ సర్కార్ భారీ ఆర్థిక సాయం.. సోషల్ మీడియాలో విమర్శలు..!

సినీ విశ్లేషకుడు, నటుడు కత్తి మమేశ్ నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం కత్తి మహేశ్ చెన్నైలోని ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్ లో చికిత్సై పొందుతున్నారు. ఆయన చికిత్స కోసం ఏపీ ప్రభుత్వం రూ.17 లక్షల భారీ ఆర్థిక సాయం విడుదల చేసింది. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ నగదును అందిస్తూ అధికారికంగా సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి శుక్రవారం లేఖ విడుదల చేశారు. కత్తి మహేష్ చికిత్సకు అయ్యే ఖర్చును భరిస్తామని సీఎం ప్రత్యేకాధికారి డాక్టర్ ఎం హరిక్రిష్ణ తెలిపారు. 

అయితే కత్తి మహేశ్ కి జగన్ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం అందించడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు కత్తి మహేశ్ కి ఏ విధంగా అంత భారాీ మొత్తంలో ఆర్థికసాయం ప్రకటించారని, సాధారణ ప్రజలకు ఇలాంటి ప్రమాదాలు సంభవించినప్పుడు ఇలాగే స్పందిస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. ఏపీ సీఎం జగన్ సాయం చేయాలనుకుంటే తన సొంత డబ్బులు ఇవ్వాలని, లేదంటే వైఎస్ఆర్ ట్రస్ట్ నుంచి అయినా మంజూరు చేయాలి తప్ప ప్రజల డబ్బును కత్తి మహేశ్ కి పంచడం సరైంది కాదని నిలదీస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

 

Leave a Comment