బంగారు మాస్క్ చేయించుకున్న గోల్డెన్ బాబా.. ధర ఎంతో తెలుసా?

కరోనా కట్టడికి మాస్క్ తప్పనిసరి. దీంతో మాస్క్ మనిషి జీవితంలో ఓ భాగమైపోయింది. మార్కెట్ లో రకరకాల మాస్కులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఓ వ్యక్తి మాత్రం మాస్క్ లోనూ తన హోదా చూపించుకోవాని అనుకున్నాడు. మాస్క్ ను ఏకంగా బంగారంతో చేయించుకున్నాడు. 

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన మనోజ్ సెంగార్ అనే వ్యక్తి మాస్క్ ను బంగారంతో చేయించుకున్నాడు. గోల్డెన్ బాబాగాపెరాగాంచిన మనోజానంద మహారాజ్ బంగారంతో చేయించిన మాస్క్ ను ధరించి వార్తల్లో నిలిచారు. 

ఈ మాస్క్ ధర అక్షరాలా రూ.5 లక్షలు ఉంటుందని, తాను చేయించుకున్న బంగారు మాస్క్ లో ట్రిపుల్ కోటింగ్ ఉందని గోల్డెన్ బాబా చెప్పారు. ఈ మాస్క్ ను పూర్తిగా శానిటైజ్ చేసినట్లు తెలిపారు. తన బంగారం మాస్క్ మూడేళ్ల పాటు పనిచేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.  

Leave a Comment