వ్యాక్సిన్ వేసుకోలేదని 63 మంది వాలంటీర్ల తొలగింపు..!

కర్నూలు జిల్లా ఆత్మకూరు పురపాలకలో 63 మంది వార్డు వాలంటీర్లను విధుల నుండి తొలగించారు. కరోనా వ్యాక్సిన్ వేసుకోకుండా పింఛనర్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందిస్తున్నారని, దీంతో వారిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు పురపాలక కమిషనర్ వెంకట దాసు ఉత్తర్వులు జారీ చేశారు. 

వాలంటీర్లు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వం సూచించినప్పటికీ.. నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని మెమోలు జారీ చేసినప్పటికీ వాలంటీర్లు స్పందించలేదు. ఫోన్ ద్వారా చెప్పినా పట్టించుకోలేదు. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వారిని తొలగించినట్లు కమిషనర్ వెంకట దాసు తెలిపారు. 

 

Leave a Comment