ప్రముఖ జాతీయ వార్తా చానెల్ ‘ఏబీపీ న్యూస్’ దేశ్ కా మూడ్ పేరుతో ఉత్తమ సీఎం ఎవరనే దానిపై సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఫలితాలను ఏబీపీ వెల్లడించింది. దేశంలో బెస్ట్ సీఎంలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. మొదటి స్థానంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలవగా, రెండో స్థానంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు.
ఇక వరస్ట్ సీఎంల జాబితాను కూడా ఏబీపీ ప్రకటించింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ ఉండగా.. రెండో స్థానంలో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, మూడో స్థానంలో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, నాలుగో స్థానంలో తెలంగాణ సీఎం కేసీఆర్ నిలిచారు. ఐదో స్థానంలో తమిళనాడు సీఎం పళని స్వామి ఉన్నారు.
టాప్ టెన్ బెస్ట్ సీఎంలు వీరే..
1.నవీన్ పట్నాయక్ – ఒడిశా
2.అరవింద్ కేజ్రీవాల్ – ఢిల్లీ
3.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి – ఆంధ్రప్రదేశ్
4.పినరయి విజయన్ – కేరళ
5.ఉద్ధవ్ ఠాక్రే – మహారాష్ట్ర
6.భూపేశ్ బఘేల్ – ఛత్తీస్ గఢ్
7.మమతా బెనర్జీ – పశ్చిమ బెంగాల్
8.శివరాజ్ సింగ్ చౌహాన్ – మధ్యప్రదేశ్
9.ప్రమోద్ సావంత్ – గోవా
10.విజయ్ రూపానీ – గుజరాత్