‘అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ’.. శరత్ పై దాడి.. తీవ్ర గాయాలు..!

‘అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ అంటూ ఓ వీడియో ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిసిందే.. హైదరాబాద్ నల్లకుంటకు చెందిన శరత్ అనే యువకుడు ఓ టీ పౌడర్ ని రీక్రియేట్ చేసి తనదైన స్టయిల్ లో తీన్మార్ స్టెప్పులు వేశాడు. అదికాస్త వైరల్ అయింది. ఇన్ స్టా, ఫేస్ బుక్, మోజ్ ఇలా ఏ సోషల్ మీడియా చూసినా అతని స్టెప్పులే.. అంతలా ఫేమస్ అయ్యాడు. 

ఇప్పుడు అదే యాడ్ అతనికి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. శరత్ పై ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆ దాడిలో శరత్ కు తీవ్ర గాయాలయ్యాయి. శరత్ తీవ్ర గాయాలతో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోలో శరత్ ముక్కు, నోట్లో నుంచి రక్తం కారుతోంది. అయితే గొడవకు గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే శరత్ పై దాడి విషయంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. హిజ్రాలను కించపరిచాడని హిజ్రాలు శరత్ పై దాడి చేసి ఉంటారని, దాడి జరిగినట్లు చేబుతున్న వ్యక్తి అసలు శరత్ కాదని వాదన వినిపిస్తోంది.. మొత్తంగా ఈ దాడిపై క్లారిటీ రావాల్సి ఉంది.    

Leave a Comment