గుండు చేయించి..జైశ్రీరాం చెప్పించారు..!

ఉత్తర ప్రదేశ్ లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ నేపాల్ పౌరుడికి బలవంతంగా గుండు కొట్టించి జైశ్రీరాం నినాదాలు చేయించారు. ఇటీవల నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ శ్రీరాముడు నేపాల్ కు చెందిన వాడని, అయోధ్య నేపాల్ లోనే ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో యూపీలోని వారణాసిలో ఈ ఘటన జరిగింది.  హిందుత్వ మతతత్వ గ్రూపునకు చెందిన అరుణ్ పాఠక్ అనే వ్యక్తి తన అనుచరులతో నేపాల్ పౌరుడుకు బలవతంగా గుండు కొట్టించి, గుండుపై జైశ్రీరాం అని స్కెచ్ పెన్నతో రాయించాడు.

అతన్ని బెదిరించి జైశ్రీరాం అని నినాదాలు చేయించాడు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై నేపాల్ ప్రభుత్వం స్పందించింది. భారత్ లోని నేపాల్ రాయబారి నీలాంబర్ ఆచార్య ఈ ఘటనను యూపీ సీఎం యోగి దృష్టికి తీసుకెళ్లడంతో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. 

 

Leave a Comment